
సాగర్నగర్, న్యూస్టుడే: గీతం డీమ్డ్ వర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఇంజినీర్స్ (ఐఈటీఈ) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులు జరగనున్న జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవాన్ని శుక్రవారం ఎన్ఎస్టీఎల్ శాస్త్రవేత్త ఎస్.రాజా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు సాంకేతికతలో నైపుణ్యం సాధిస్తూ... నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలన్నారు. గీతం ఈసీఈ విభాగాధిపతి ఆచార్య పి.వి.వై.జయశ్రీ మాట్లాడుతూ విద్యార్థులకు ఈ ఉత్సవంలో కమ్యూనికేషన్, ఆర్కిటెక్చర్ తదితర పలు అంశాలపై పోటీలతో పాటు సదస్సులను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ ఇంద్రజాల నిపుణురాలు సుహాసిని షాను కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.లక్ష్మీప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ సి.ధర్మరాజు సత్కరించారు. ఫ్యాకల్టీ సలహాదారు కె.కరుణకుమారి, విద్యార్థి విభాగం అధ్యక్ష, కార్యదర్శిలు జి.భరత్సాయి, గోపీనాథ్ పాల్గొన్నారు.